G-N7RFQXDVV7 ఉత్తర, దక్షిణాల మధ్య నిప్పు రాజుకుంటోందా?

Ticker

6/recent/ticker-posts

ఉత్తర, దక్షిణాల మధ్య నిప్పు రాజుకుంటోందా?



అప్పట్లో బాలీవుడ్ సినిమాలకు ఒక ప్రత్యేకత వుండేది. ఏ హీరోయిన్ అయినా, హీరో అయినా  బాలీవుడ్ లో తమ అద్రుష్టాన్ని పరీక్షించుకోవాలి అని ఎదురు చూసే వాళ్లు. కానీ ఐదు సినిమాలతో సీను రివర్స్ అయ్యింది. ఇప్పుడు, ఉత్తరాదిలోనూ, దక్షిణాదివాళ్లు కూడా తెలుగు సినిమాలో నటించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇక హీరోయిన్లకైతే తెలుగు సినిమాలో ఛాన్స్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయినట్టే అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. ఒక వైపు తమిళ, మళయాలీలు కూడా తెలుగు సినిమాలపై జోకులు పేల్చేవాళ్లు, ఒక్క రాజమౌళి సేద్యంతో నవ్విన నాపచేను పండింది. టెక్నీషియన్ల నుంచి ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరూ తెలుగు సినిమాలో ఛాన్స్ దొరక్కపోతుందా? అని ఎదురు చూస్తున్నారు. తెలుగు సినిమా ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందుతోంది అంటే తెలుగు సినిమాలో ఎమోషన్స్ ఎక్కువగా వుంటాయి. ప్రస్తుత కాలంలో కుటుంబాలలో సైతం అది లోపిస్తోంది. మరిచిపోతున్న ఎమోషన్స్ ను బయటకు తీస్తున్నందుకే తెలుగు సినిమాకు ఇంత ఆదరణ అని ఒక వైపు చెబుతుంటే మరో వైపు మాత్రం తెలుగు నిర్మాతల దగ్గర డబ్బు చాలా వుంది. అంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఎవరైనా తీస్తారు అంటూ కొంతమంది బేషాలకు పోతున్నారు. ఆ నమ్మకం మీ నిర్మాతలకు మీరు కల్పించలేకపోతున్నందుకు సిగ్గు పడండి అంటూ ఇటీవల జరిగిన ఓ వెబ్ నార్ లో ఆసక్తికరమైన చర్చలు జరిగాయి.

ప్రస్తుతం  ‘పుష్ప, త్రిబుల్ ఆర్, కేజీ ఎఫ్ 2 చిత్రాలు దక్షిణాది బాక్సాఫీసులో కలకలం స్రుష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవల పలు వురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ మధ్య జాన్ అబ్రహాం నేను రీజనల్ సినిమాల్లో నటించను అని స్టేట్ మెంట్ ఇవ్వడంతో బాలీవుడ్ రీజనల్ కాదా? హిందీ జాతీయ భాష అని ఎవరైనా రాసిచ్చారా? ఒకసారి రైట్ టు యాక్ట్ ద్వారా తెలుసుకోండి అంటూ వివాదం చెలరేగింది. మరో వైపు అజయ్ దేవగన్ కూడా తన మనసులోని ద్వేషాన్ని బయట పెట్టారు. ఇటీవల అభిషేక్ బచ్చన్ కూడా బాలీవుడ్ లో టాలెంట్ లేదు అనడం సరికాదు అంటూ తన కుళ్లుబోతుతనాన్ని బయట పెట్టాడంటూ పలు పత్రికలు రాశాయి. కాగా దక్షిణాది సినిమాలను చూసి బాలీవుడ్  వెన్నులో వణుకు పుడుతోందని జాతీయ అవార్డు గ్రహీత మనోజ్ బాజ్ పాయ్ వ్యాఖ్యానించడం పుండు మీద కారం చల్లినట్టయ్యింది… వరుసగా మూడు సినిమాలు నార్త్ ఇండియా బాక్సాఫీసును షేక్ చేస్తున్న నేపథ్యంలో దక్షిణాది సినిమాలను ప్రశంసిస్తూ బాలీవుడ్ దర్శకులకు చురకలు అంటించారు. రాబోయే కాలంలో పుష్ప 2, లైగర్ లాంటి సినిమాలు త్వరలోనే బాలీవుడ్ స్క్రీన్ ను టచ్ చేయనున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా విజయం సాధిస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు బాలీవుడ్ లో వున్న హీరోలకే దిక్కు లేకుంటే ఇప్పుడు దక్షిణాది హీరోలు కూడా ఇక్కడికి వచ్చి బాక్సాఫీసు కలెక్షన్ షేర్ చేసుకుంటే మాకేం వేల్యూ వుంటుంది అని కొందరు యువ హీరోలు తమ ఆక్రోశం వెలిబుచ్చినట్టు తెలిసింది. ఇదిలాగే కొనసాగితే ఉత్తరాది, దక్షిణాది మధ్య అంతరం పెరిగేలా వుంది. అంటూ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.